ఆటలో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత గొప్ప రికార్డులు సృష్టించాడో,అదే విధంగా ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించిన తరువాత తన కొత్త జీవితాన్ని వినూత్న రీతిలో ప్రారంభించిన తెలిసిందే.సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కూడా తనకంటూ విదేశాలలో, మన దేశంలో ధోనీ పంటకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలలో మార్కెట్ చేస్తూ ఇతర రైతులకు కూడా ఈ మార్గాన్ని సుగమం చేసే దిశగా అడుగులేస్తోంది.అయితే ధోనీ అప్పుడప్పుడు తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన విశేషాలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటున్నాడు.
అయితే ఈ సారి ధోనీ తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు.ఈ సందర్భంగా వీడియోలో తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న స్ట్రాబెరీ లను రుచి చూస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో విడుదల చేశాడు.
ఈ వీడియో క్రింద ధోనీ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే ఒక్క పండు కూడా మార్కెట్ కు వెళ్ళేలా లేదని సరదాగా కామెంట్ చేశాడు.
ఇక వీడియోకు ధోనీ అభిమానులు సరదాగా రిప్లై ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు
.