నిన్న అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో ఆఫీస్లో జరిగిన సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఎమ్మార్వోపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.
ఆ తర్వాత అతడు కూడా నిప్పు పెట్టుకున్నాడు.ఎమ్మార్వో మృతి చెందగా సురేష్కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ సంఘటనలో ఎవరికి తెలియని విషయం ఏంటీ అంటే విజయారెడ్డి మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆమెను కాపాడేందుకు ఆమె వ్యక్తిగత డ్రైవర్ గురనాథం ప్రయత్నించాడు.ఆ సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి.
గురునాథంకు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.నిన్న తీవ్ర గాయాలతో గురునాథం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు.ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.గురునాధం గత 8 ఏళ్లుగా విజయారెడ్డి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు.
విజయారెడ్డికి అతడు చాలా నమ్మకస్తుడు.సూర్యపేటకు చెందిన గురునాథం మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు.
మున్నీరు అవుతున్నారు.గురునాధంకు భార్య ఒక బిడ్డ ఉన్నారు.
ప్రస్తుతం గురునాథం భార్య మళ్లీ గర్బవతి.ఆమె త్వరలో డెలవరీకి సిద్దంగా ఉంది.
ఇలాంటి సమయంలో గురునాథం మృతితో ఆమె తల్లడిల్లి పోతుంది.ఆమెను కుటుంబ సభ్యులు ఓదార్చలేక పోతున్నారు.