ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పల్లెలు పట్టణంలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ఉన్న ప్రతి ఒక్కరికి మాస్క్లను పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించాడు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మాస్క్లను పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.ప్రతి ఒక్కరు విధిగా మాస్క్లు ధరించాలంటూ ఈ సందర్బంగా ఆయన విజ్ఞప్తి చేశాడు.
రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా మాస్క్ను కొనుగోలు చేసే అవసరం లేకుండా జగన్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాం.ఇప్పటి వరకు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు.
ఇంటింటికి కూడా మాస్క్లను ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు.కరోనాకు ఇది బ్రహ్మాస్త్రం అని తప్పకుండా ప్రతి ఒక్కరు కరోనాను ఎదిరించేందుకు ఈ బ్రహ్మాస్త్రంను వినియోగించాలని, జగన్ ప్రభుత్వం ఇస్తున్న ఈ బ్రహ్మాస్త్రంను ప్రతి ఒక్కరు ఉపయోగించి కరోనాకు దూరంగా ఉండాలని ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశాడు.