ఏపీ ప్రజలకు కరోనా బ్రహ్మాస్త్రం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పల్లెలు పట్టణంలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ఉన్న ప్రతి ఒక్కరికి మాస్క్‌లను పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించాడు.

 Mp Vijaysai Reddy Says Good News For Ap Peoples About Corona Masks Distribute Al-TeluguStop.com

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మాస్క్‌లను పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌లు ధరించాలంటూ ఈ సందర్బంగా ఆయన విజ్ఞప్తి చేశాడు.

రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా మాస్క్‌ను కొనుగోలు చేసే అవసరం లేకుండా జగన్‌ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్దం అయ్యాం.ఇప్పటి వరకు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు.

ఇంటింటికి కూడా మాస్క్‌లను ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు.కరోనాకు ఇది బ్రహ్మాస్త్రం అని తప్పకుండా ప్రతి ఒక్కరు కరోనాను ఎదిరించేందుకు ఈ బ్రహ్మాస్త్రంను వినియోగించాలని, జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ఈ బ్రహ్మాస్త్రంను ప్రతి ఒక్కరు ఉపయోగించి కరోనాకు దూరంగా ఉండాలని ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube