చంద్రబాబు పిశాచి.. గోతికాడ నక్క ! రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ ?

టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తావన వస్తే చాలు, వైసీపీ నేతలు ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతూ తిట్టు పోస్తూ ఉంటారు వైసీపీ నేతలు.

గత టీడీపీ ప్రభుత్వ పరిపాలన ను ఇప్పటికీ ఎత్తిచూపుతూ, గత ప్రభుత్వ లోపాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ కు సన్నిహితుడైన విజయ్ సాయి రెడ్డి అయితే సందర్భం ఉన్నా, లేకపోయినా లోకేష్, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులను నిత్యం విమర్శిస్తూనే ఉంటారు.సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ విజయసాయిరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా, గట్టిగానే కౌంటర్ ఇస్తుంటారు.

తాజాగా చంద్రబాబుపై విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే మంది పచ్చ మీడియా.  ముసుగేసుకున్న పచ్చ మీడియా అధినేతల తీరు మరీ దారుణం.41 వేల కోట్ల లావాదేవీలకు లెక్కలు లేవు అని హెడ్డింగ్ లు పెట్టేసారు.టీవీ ల్లో డిబేట్ లతో ఊదరగొట్టేశారు.

తూచ్ అని తేలిపోయాక అంతా గప్ చుప్.బిల్లు లేకపోవడానికి ఇది హెరిటేజ్ కొట్టా  ఇది ? అంటూ "టీడీపీ అనుకూల మీడియా పై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.తాజాగా మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి ఘాటు పదజాలంతో విరుచుకు పడ్డారు.

Advertisement

జల జగడంతో రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేయాలని బాబు గోతి కాడ నక్కలా కాచుకు కూర్చున్నాడు.ఎల్లో మీడియా, ఆ పార్టీ చోటామోటా లీడర్లు బాధ్యత లేకుండా ఒక్ర భాష్యాలు చెబుతున్నారు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.

కేంద్రం న్యాయం చేస్తుందనే భావిస్తున్నాం." అంటూ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ లో విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు