బాబు కు ఆ రోగం ఉందని ఆయన డిసైడ్ చేసేశాడు!

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత రాజకీయ నాయకుల విమర్శలన్నీ ట్విట్టర్ వేదికగానే జరుగుతున్నాయి.ఒకరి మీద ఒకరు ట్విట్స్ పెట్టుకుని విమర్శలు చేసుకూంటూ వాటిని ఫాలో అయ్యేవారికి వినోదం పంచుతున్నారు.

 Mp Vijayasai Reddy Coments On Tdp Chief Chandra Babu-TeluguStop.com

తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజసై రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు గుప్పించాడు.

హైదరాబాద్‌ను నేనే నిర్మించా అని చంద్రబాబు పదే పదే చెప్పుకోవడాన్ని ఆయన తనదైన శైలిలో వెటకారం చేసాడు.

తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందనేది నాకు ముందే తెలుస్తుందని గతంలో బాబు చేసిన వ్యాఖ్యలను సైతం ట్విట్టర్ లో ప్రస్తావించారు విజయసాయి రెడ్డి.సుడోలాజియా ఫెంటాస్టికా అనే మానసిక రుగ్మత వల్లే టీడీపీ అధినేత ఇలా అయిపోయారని ట్విట్ పెట్టారు.

తర్కానికి అందని కోతలు కోయడం దీని లక్షణమేనని అందులో పేర్కొన్నారు విజయసాయి.

అయితే దీనిపై టీడీపీ కూడా ప్రతి విమర్శలు చేసింది.ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న స్పందిస్తూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు.‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధి వలనే జగన్ గారు, మీరు ఇలా అయిపోయారు విజయసాయిరెడ్డి గారూ.అబద్ధాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు’ అంటూ బుద్దా వెంకన్న ప్రతిస్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube