బీఆర్ఎస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కౌంటర్ ఇచ్చారు.నాగోబా జాతరలో బీఆర్ఎస్ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.
నాగోబా ఆలయానికి ప్రపోజల్ పంపిస్తే కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.బీజేపీని తిట్టడానికే మంత్రులు దర్బార్ పెట్టారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ భూమి, పోడు భూమి ఎక్కడుందో తెలియదని ఎద్దేవా చేశారు.గిరిజన యూనివర్సిటీని ములుగు జిల్లాకు తరలించారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎంపీ బాపురావు డిమాండ్ చేశారు.