వైసీపీని వీడి త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అధిష్టానంపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై పార్లమెంటులో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, కానీ ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామని జగన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.
తనకు తెలుగు భాషను ప్రేమించడం మాత్రమే తెలుసు అని అది తప్పు అయితే తాను శిక్ష అనుభవించడానికి నా సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ప్రకటించారు
పార్లమెంటులో తెలుగు భాష గొప్పదనం గురించి తాను మాట్లాడానని, తెలుగు అకాడమీ నిధుల గురించి కూడా ప్రస్తావించాను తప్ప ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు అసలు తన నోటి వెంట ఇంగ్లీష్ ఎక్కడ రాలేదని తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాషకు చేసిందేమీ లేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు అకాడమిని ఏర్పాటు చేసిందని, దానికి నిధులు కేటాయించాలని తాను కేంద్రాన్ని కోరినట్టు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.అయితే ఇప్పటి వరకు ఎవరు పార్టీ తరఫున ఈ విషయాల గురించి అడగలేదని మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అని రామకృష్ణ రాజు చెప్పుకొచ్చారు