వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయటం తెలిసిందే.ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీయడానికి రఘురామకృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కు ట్ర పన్నిన్నట్లు సిఐడి ఆయనను అరెస్టు చేయడంతో కేసు నమోదు కాగా ఆయనకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేసి నివేదిక ప్రత్యేక వైద్య బృందం న్యాయస్థానానికి అందించడంతో ఇటీవల.
రఘురామకృష్ణంరాజు కు బెయిల్ మంజూరు కావడం జరిగింది.గుండెకు శస్త్ర చికిత్స, కాలికి గాయాలు కావడంతో ఆయన కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
దీంతో వైద్య పరీక్షలు మొత్తం పూర్తి కావడంతో పాటు బెయిల్ మంజూరు కావడంతో రఘురామకృష్ణంరాజు తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల మే 17 వ తారీకు వైద్య పరీక్షల నిమిత్తం ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు తాజాగా రఘురామకృష్ణంరాజు కి బెయిల్ మంజూరు కావడంతో పాటు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో దాదాపు వారం రోజులకు పైగానే ఆస్పత్రిలో ఉన్న ఆయన నేడు బయట ప్రపంచంలోకి వస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఈ క్రమంలో బెయిల్ షరతుల తో కూడింది కావటం తో మీడియా కి అదేవిధంగా సోషల్ మీడియా కి ఎటువంటి ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదని ఈ కేసుకు సంబంధించి మాట్లాడకూడదని సుప్రీం షరతులు విధించింది.