హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రఘురామకృష్ణంరాజు..!!

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయటం తెలిసిందే.ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీయడానికి రఘురామకృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కు ట్ర పన్నిన్నట్లు సిఐడి ఆయనను అరెస్టు చేయడంతో కేసు నమోదు కాగా ఆయనకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేసి నివేదిక ప్రత్యేక వైద్య బృందం న్యాయస్థానానికి అందించడంతో ఇటీవల.

 Mp Raghuramakrishnam Raju Dishcharged From Hospital Mp Mp , Ysrcp , Raghuramakri-TeluguStop.com

రఘురామకృష్ణంరాజు కు బెయిల్ మంజూరు కావడం జరిగింది.గుండెకు శస్త్ర చికిత్స, కాలికి గాయాలు కావడంతో ఆయన కి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

దీంతో వైద్య పరీక్షలు మొత్తం పూర్తి కావడంతో పాటు బెయిల్ మంజూరు కావడంతో రఘురామకృష్ణంరాజు  తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల మే 17 వ తారీకు వైద్య పరీక్షల నిమిత్తం ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు తాజాగా రఘురామకృష్ణంరాజు కి బెయిల్ మంజూరు కావడంతో పాటు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో దాదాపు వారం రోజులకు పైగానే ఆస్పత్రిలో ఉన్న ఆయన నేడు బయట ప్రపంచంలోకి వస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలో బెయిల్ షరతుల తో కూడింది కావటం తో మీడియా కి అదేవిధంగా సోషల్ మీడియా కి ఎటువంటి ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదని ఈ కేసుకు సంబంధించి మాట్లాడకూడదని సుప్రీం షరతులు విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube