మటన్ మర్ట్ ల పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం మాంసం విక్రయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిన్న ప్రకటన చేయటం తెలిసిందే.నాణ్యమైన మటన్ ప్రజలకు అందించటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజల ఆరోగ్య దృష్ట్యా.
మటన్ మార్ట్ లు రాష్ట్రంలోకి తీసుకురానున్నట్లు ముందుగా విశాఖ, విజయవాడలో నాలుగు చొప్పున మటన్ మార్ట్ మార్కెట్లో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ఇటువంటి తరుణంలో లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు.
జగనన్న మాంసం దీవెన అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మటన్ మటన్ ఏంటండీ నీచంగా.
ఎక్కడైనా రాష్ట్రప్రభుత్వం మాంసం విక్రయిస్తుందా ఛీ అంటూ ఘాటుగా స్పందించారు.ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి వినిపిస్తూ ఇటువంటివి నిర్ణయాలకు బదులు రైతులు పండించిన కూరగాయలకు మెరుగైన ధరలు ఏపీ ప్రభుత్వం లభించేలా చూడాలని సూచించారు.