వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నవ సూచనలు (విధేయతతో) అనే హెడ్డింగ్ తో లెటర్ రాయడం జరిగింది.ఇటీవల వైసీపీ ఎంపీలు తనపై వేటు వేయించేందుకు పార్లమెంట్ స్పీకర్ ని కలవటానికి ఉద్దేశిస్తూ .
వైసిపి పార్టీ ఎంపీలు గజనీ దండయాత్రలు చేస్తున్నారంటు సెటైర్లు వేశారు.అనర్హత వేటు అంటూ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ని ఏడు సార్లు కలవడం జరిగింది అని “యధా రాజా తధా మంత్రి” అన్నట్లు జగన్ అడుగుజాడల్లో ఎంపీ విజయసాయి రెడ్డి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో తనపై అనర్హత వేటు వేయకపోతే పార్లమెంటును స్తంభింపజేస్తాం అని విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ అంత దమ్ము ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అదే రీతిలో పోలవరానికి నిధులు కోసం పోరాడాలి అంటూ సూచనలు చేశారు.అంత మాత్రమే కాక ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై అనర్హత వేటు వేయించాలని అనుకుంటున్న వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన హక్కులకోసం పోరాడితే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు సూచనలు చేశారు.