టాలీవుడ్ లో నటిగా ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో తెరంగేట్రం చేసి తరువాత అడపాదడపా సినిమాలు చేసిన నటి నవనీత్ కౌర్.నటిగా ఒకే అనిపించుకున్న ఈ భామ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చైర్ ని మాత్రం అందుకోలేకపోయింది.
అయితే దశాబ్ద కాలం పాటు హీరోయిన్ గా, ఐటెం భామగా సినిమాలు చేసిన ఈమె తరువాత మహారాష్ట్రకి చెందిన ఒక రాజకీయ ప్రముఖుడుని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళిపోయింది.ఇదిలా ఉంటే గత ఎన్నికలలో ఆమె మహారాష్ట్రలో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది.
ఇక రాజకీయంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఆమె మాటల చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంది.మోడీని కూడా తన మాటల ప్రవాహంతో చప్పట్లు కొట్టేలా చేసింది.
ప్రస్తుతం ఆమె రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అక్కడ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భయపెడుతున్నాయి.చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
ఇప్పుడు అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్ కి కరోనా వచ్చినట్లు తెలుస్తుంది.ర్యాపిడ్ టెస్టుల్లో భాగంగా ఆమెకు కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
ఈ విషయాన్నీ నవనీత్ కౌర్ పేస్ బుక్ ద్వారా తెలియచేసారు.నా కుమార్తె, కుమారుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది.
ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా తొలి కర్తవ్యం.వారిని జాగ్రత్తగా చూసుకొనే క్రమంలో నాకూ వైరస్ సోకింది అని పేర్కొన్నారు.
ఇక అభిమానుల ఆశీస్సులతో తామంతా కరోనా జయిస్తామని నవనీత్ తెలియచేసారు.