వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీ అధిష్టానానికి మొదటి నుండి తల నొప్పిగా ఉన్న సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను బహిరంగంగా విభేదిస్తూ.
రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తూ ఉన్నారు.ఈ క్రమంలో వైసిపి పార్టీ అధిష్టానం ఎప్పటినుండో రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయడానికి మరోపక్క ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ని వైసీపీ నాయకులు.రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయడం జరిగిందని.
ఇటువంటి తరుణంలో తాజాగా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్… మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నీ కలిసి.రఘురామకృష్ణంరాజు పై 290 పేజీలో సమాచారం అందజేసి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో త్వరలోనే రఘురామకృష్ణంరాజు కు నోటీసులు అందుతాయని.ఆ రీతిగానే స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తాము భావిస్తున్నట్లు భరత్ చెప్పుకొచ్చారు.
రఘురామకృష్ణంరాజు మొదటి నుండి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అదేరీతిలో పార్టీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మార్గానీ భరత్ చెప్పుకొచ్చారు.