అప్పుడెప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఓ మాట చెప్పారు.గుర్తుకుందో లేదో.
ఆ సభలో రైతులకు అతి తొందర్లో ఓ శుభవార్త చెబుతా అన్నారు.మర్చిపోయారా? అంటూ ఓ ఎంపీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.
శనివారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.గతంలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.
దాదాపు రెండు నెలల కిందట కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెబుతానని చెప్పిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.మరి సీఎం కేసీఆర్ రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాడు.
కానీ ఆ శుభవార్త ఏంటో చెప్పడం లేదని అన్నారు.గతంలో ప్రభుత్వం దశల వారీగా చేసిన రుణమాఫీ వారి వడ్డీలకు సరిపోలేదన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.‘‘ సీఎం కేసీఆర్ తను ఇచ్చిన హామీలను విస్మరించడం కరెక్ట్ కాదు.వెంటనే మీరు ఇచ్చని హామీలను నెరవేర్చాలి.కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో రైతులకు శుభవార్త చెబుతున్నారు.
కానీ రెండు నెలల గడుస్తున్నా దాని ఆచూకీ ఇప్పడికి లేదు.హామీ నెరవేర్చడం కుదరకపోతే ప్రెస్ మీట్ పెట్టి రైతులకు క్షమాపణ చెప్పాలి.
’’ అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో 90 శాతం పూర్తయిన ఎస్ఎల్ బీసీ, బ్రాహ్మణ వెల్లంల, పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కమీషన్లు దండుకుంటున్నారని, ప్రభుత్వం కురుస్తున్న వర్షాల వల్లే ఉన్న చెరువులు నిండుతున్నాయని, ఇందులో సీఎం కేసీఆర్ గొప్పతనం ఏముందని ప్రశ్నించారు.త్వరలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎంపీ డిమాండ్ చేశారు.