టీడీపీ కీలక నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ హైకమాండ్ కి ఉహించనీ షాక్ ఇచ్చినట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వినబడుతున్నాయి.మేటర్ లోకి వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను గాని తన కూతురు గాని పోటీ చేసే ప్రసక్తి లేదని తెలిపారు.
ఇక ఏ ఎన్నికలలో పోటీ చేయను అని ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పినట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ హైకమాండ్ పై ఎంపీ నాని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.
అందువల్లే ఇటీవల చంద్రబాబు విజయవాడ పర్యటించిన సమయంలో కూడా బాబు పర్యటనకు చాలా దూరంగా కేశినేని నాని ఉన్నట్లు పార్టీలో టాక్.
ఈ తరుణంలో ఇక భవిష్యత్ లో ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయను అని కేశినేని నాని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రావడం ఏపీ రాజకీయాల్లో.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే కేశినేని నాని సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం.విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల టైంలో టీడీపీ కి చెందిన కీలక నాయకులు.ఎంపీ కేశినేని నాని పై విమర్శలు చేయడం జరిగింది.
ఈ తరుణంలో టీడీపీ హైకమాండ్ కలుగజేసుకోవటం తో గొడవ సద్దుమణిగింది.అయితే ఆ గొడవకు సంబంధించి.
పార్టీ పెద్దగా తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించినట్లు అందువల్లే ఎంపీ కేశినేని నాని.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయం చంద్రబాబుతో కేశినేని నాని చేపినట్టు కూడా ఏపీ రాజకీయాల్లో టాక్.