సాధారణంగా ఇద్దరు ఎంపీలు ఎదురుపడితే వారి ప్రాంతాల్లోని ప్రజల గురించో లేదా పార్టీల గురించో చర్చించుకుంటూ ఉంటారు.అయితే ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్ గా జరిగింది.
ఓ ఎంపీని చూసి మరో ఎంపీ షాక్ అయ్యాడు.ఎంపీ దయానిధి మారన్ వెళ్తున్నటువంటి విమానం కెప్టెన్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ కనిపించడం చూసి మారన్ షాక్ తిన్నాడు.
ఆయన్ని అలా చూడటం ఓ మర్చిపోలేని అనుభూతి అంటూ తన సంతోషాన్ని షేర్ చేశాడు.ఆ రోజు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ని పూర్తి చేసుకున్న తర్వాత ఎంపీ దయానిధి మారన్ ఢిల్లీ నుండి తన ఊరికి బయల్దేరాడు.
తన సొంత గ్రామానికి వెళ్ళడానికి విమాన ప్రయాణం చేయాల్సి ఉంది.ఎయిర్ పోర్ట్ లో అన్ని పనులు పూర్తి చేసుకుని విమానం వైపు నడిచాడు.
బోర్డింగ్ పూర్తయిందని ఫ్లైట్ క్రూ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు.అంతలోనే విమానంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి ఆ ఎంపీని ఫ్లైట్ కెప్టెన్ ఓ మాట పలకరించాడు.
మీరు కూడా ఇదే ఫ్లైట్ లో వెళ్తున్నారా అని అడిగాడు.
ఆ ఎంపీ మాస్కు వేసుకొని ఉండడం వల్ల కెప్టెన్ ఎవరో గుర్తుపట్టలేదు.
అందుకే మారన్ ఆ ఎంపీ ఎవరనేది గుర్తుపట్టలేదు.అయితే ఆయన గొంతు మాత్రం ఎక్కడో విన్నట్టుగానే ఉండటంతో ఆయన ఎవరబ్బా అని ఆలోచిస్తూనే.
అవును అని జవాబు చెప్పారు.దయానిధి మారన్ గుర్తుపట్టలేదని అనుకుని ఆ కెప్టెన్ నవ్వుకుంటూ ఉన్నాడు.
ఆ తర్వాత నన్ను గుర్తుపట్టలేదా అని తిరిగి ఆయన్ని అడిగాడు.అప్పుడు ఆ కెప్టెన్ ఎవరో కాదు కొన్ని గంటల ముందు తనతో పార్లమెంటరీ కమిటీ లో పక్కన కూర్చొని మాట్లాడిన ఎంపీ రాజీవ్ ప్రతాప్ అని అర్థమైంది.ఆయన పైలట్ అవతారంలోకి మారడంతో దయానిధి మారన్ ఆశ్చర్యపోయాడు.తన అనుభవాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు.