ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.
విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ డీపీఆర్ ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.అనంతరం రాష్ట్రంలో టీచర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని విమర్శించారు.
ఏ ప్రభుత్వంలోనైనా ఎక్కువ పని చేసేది టీచర్లు మాత్రమేనన్నారు.అలాంటిది ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకు మాత్రమేనా అని అడిగారు.
సీఎం మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.టీచర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.