నిన్న ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాల లో జరిగిన సంఘటనలో గాయపడిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన లోకేష్ పర్యటన పై ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు.స్థానిక మంత్రి శంకర్ నారాయణ ఇంటిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ తెలుగు స్పష్టంగా మొదట మాట్లాడడం లోకేష్ నేర్చుకోవాలని అలా మాట్లాడటం రాకపోతే కనీసం ఇంట్లో బట్టీ పట్టి సభలు సమావేశాల్లో మాట్లాడాలని హితవు పలికారు, గవర్నమెంట్ జీవో అన్న పదాన్ని కూడా మాట్లాడలేని లోకేష్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి పై అవాకులు చవాకులు పేలడం మంచిది కాదన్నారు, లోకేష్ నోటిలో పప్పు గిత్త పెట్టి తిప్పితే అన్నా మాట స్పష్టంగా వస్తుందేమోనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈరోజు అనంతపూర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశాలు పెట్టి దాన్ని విద్యార్థి లోకం లో జరిగిన సమావేశం గా చిత్రీకరించడం మంచి పద్ధతా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా లోకేష్ బాబు మీ నీచ రాజకీయాల కోసం విద్యార్థులను వాడుకోవడం మానుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు
.