టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం పై తాజాగా మండిపడ్డారు.ఈ విషయంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొదటినుండి మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం వేసిన కమిటీ లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు అంటూ నారా లోకేష్ తాజాగా చేసిన కామెంట్లను అవినాష్ రెడ్డి ఖండించారు.
లోకేష్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలిపారు.
తాను స్టీల్ ప్లాంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నానంటూ తాను సరిగ్గా మాట్లాడటం సరైనది కాదని పేర్కొన్నారు.లోకేష్ ఆరోపణలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంది అంటూ కొట్టిపారేశారు.
అదే విధంగా మంత్రి పెద్దిరెడ్డి పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కామెంట్ చేయడం సమంజసం కాదు అంటూ హితవు పలికారు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, ఇప్పటికే ఈ విషయంలో సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసినట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.