నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న దిషా నిందితుల ఎన్కౌంటర్ విషయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విభిన్నంగా స్పందించాడు.99.9 శాతం మంది దిషా నిందితుల ఎన్కౌంటర్ను సమర్ధిస్తున్నారు.ఎవరైతే ఆ ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తున్నారో వారిలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ఢిల్లీలో లోక్సభ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఎన్కౌంటర్పై స్పందిచాడు.
ఎన్కౌంటర్ జరగడంపై ఆయన విచారం వ్యక్తం చేశాడు.దిషా నిందితుల ఎన్కౌంటర్ అనేది ప్రస్తుతం మానవ హక్కుల కమీషన్ స్వీకరించింది.ప్రస్తుతం విచారణ జరుగుతుంది.పోలీసులు మానవ హక్కుల సంఘంకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే.
ఎన్కౌంటర్స్ అనేవి నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను.నేను ఎప్పుడు కూడా ఎన్కౌంటర్లను సమర్ధించను అంటూ ఎంపీ చెప్పుకొచ్చాడు.
ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడాలి తప్ప ఇలాంటి సంఘటనలు సరికాదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.