ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు కాని ఏపీ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు, తక్కువ కాలం ఉన్న తన పరిపాలన, సంక్షేమంతో ప్రజల హృదయాలని గెలుచుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.వీరిద్దరి కాలంలో ఏపీ రాజకీయాలు ఎవరూ ఊహించనన్ని మార్పులు జరిగాయి.
ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చింది.పరిపాలనలో ఇద్దరు కూడా ఘనాపాటిలుగా పేరు తెచ్చుకున్నారు.
అలాంటి వీరిద్దరి మధ్య స్నేహం గురించి కూడా రాజకీయాలలో చెప్పుకుంటారు.చంద్రబాబు నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో వైఎస్ తో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.
ఒకరి ఆలోచనలు ఒకరితో పంచుకునేవారు.అలాంటి వీరి స్నేహబంధంపై ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
చదరంగం అనే పొలిటికల్ వెబ్ సిరీస్ తో పాపులరైన రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా యన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇందులో కీలకంగా వైయస్సార్ చంద్రబాబు స్నేహం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది.
వారిద్దరు రాజకీయాల్లో అడుగు పెట్టి అక్కడ ఎదిగే క్రమంలో ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఎలా ఉండేది.కాలక్రమంలో విరుద్ధమైన పార్టీలతో రాజకీయ శత్రువులుగా ఎలా మారారు అన్నది తెరపై ఆవిష్కరించనున్నారు.
అయితే ఇందులోనూ ఆరంభ స్నేహాన్ని హైలైట్ గా చూపిస్తారట.ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
మొదటి భాగంలో ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎదుగుదల సహా ఆయన సీఎం అయ్యేవరకూ కథ నడుస్తుందని తెలుస్తుంది.ఇక రెండో భాగంలో కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ రాజకీయంగా ఎలా ఎదిగారు.
ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో తేదేపా అధినాయకుడు చంద్రబాబుతో వైరం ఎలా సాగింది అనే ఎలిమెంట్స్ ని తెరపై చూపించాబోతున్నట్లు తెలుస్తుంది.