దాదాపు సంవత్సరం క్రితం మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన సంగతి తెలిసిందే.కొత్త వైరస్ కావడం, వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడంతో కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసి థియేటర్లపై కూడా ఆంక్షలు విధించింది.
డిసెంబర్, జనవరి నెలల్లో కరోనా కేసులు తగ్గడంతో కేంద్రం థియేటర్లపై ఆంక్షలను పూర్తిస్థాయిలో సడలించింది.అయితే థియేటర్లు ఓపెన్ అయినా కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీల్లోనే విడుదలవుతూ ఉండటం గమనార్హం.
త్రిష ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకటి ఓటీటీలో విడుదలవుతున్నట్టు ప్రకటన వెలువడింది.దర్శకనిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు.థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉన్నా పరమపథం విలయాట్టు మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడంపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తిరుగ్ననం అనే డైరెక్టర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు.
కరోనా వల్ల గతంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడగా ఈ సినిమా మేకర్స్ మొదట సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారు.త్రిష కూడా ఈ సినిమా నటిగా తనకు మంచిపేరు తెచ్చిపెడుతుందని భావించారు.కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్నట్టు ప్రకటన వెలువడింది.ఈ ప్రకటన పట్ల అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.
త్రిష మూవీ మేకర్స్ తో మాట్లాడి ఈ సినిమాను థియేటర్లలో విడుదలయ్యే విధంగా జాగ్రత్త పడితే బాగుంటుందని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన ఉంటే గతేడాదే ఈ సినిమాను రిలీజ్ చేసి ఉండవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గతంలో త్రిష హీరోయిన్ గా నటించిన 96 సినిమా కూడా హిట్ టాక్ వచ్చినా కొన్ని రోజుల్లోనే టీవీలో ప్రసారమైన సంగతి తెలిసిందే.