2022 ఏడాది వచ్చి అప్పుడే ఏడు నెలలు గడుస్తున్నా చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.
అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.
ప్రేక్షకులు వచ్చిన సినిమాను వచ్చినట్టు ప్లాప్ చేస్తుండడంతో టాలీవుడ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
గత జులై లో విడుదల అయినా అన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.దీంతో టాలీవుడ్ సినీ పెద్దలందరూ ఆలోచనలో పడ్డారు.పరిస్థితి ఇలాగె కొనసాగితే నష్టం తప్పదు అని అందరు సమావేశం అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ క్రంమలోనే ఆగష్టు మొదటి వారంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ రెండు సినిమాలు కూడా ఆడియెన్స్ ను మళ్ళీ థియేటర్స్ కు మునుపటిలా వచ్చేలా చేయడానికి కీలక మార్పులు తీసుకున్నారు.దుల్కర్ సల్మాన్ సీతా రామం, నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ రెండు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.దీంతో ఆగష్టులో మన టాలీవుడ్ మంచి శుభారంభంతో స్టార్ట్ అయ్యింది.
అయితే ఇందుకు మన నిర్మాతలు చేసిన కీలక మార్పులు కూడా ఒక కారణం అనే చెప్పాలి.మొన్నటి వరకు టికెట్ ధరకు కొండెక్కాయి.
దీంతో ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటేనే బయపడి పోయారు.సినిమా ఎంత మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం దారుణంగా రావడంతో అసలు ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో అని భయపడ్డారు.
దీంతో నిర్మాతలు మాత్రమే కాదు హీరోలు, హీరోయిన్ లు సైతం రంగంలోకి దిగి ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు కృషి చేస్తున్నారు.నిన్న వారం రిలీజ్ అయినా బింబిసార, సీతా రామం సినిమాలను చాలా తక్కువ ధరలకు టికెట్ రేట్స్ ను ఫిక్స్ చేసి రిలీజ్ చేసారు.
అంతేకాదు ఈ సినిమాలు రెండు కూడా హిట్ టాక్ రావడం మరింత ప్లస్ అయ్యింది.అందుకే ప్రేక్షకులు కూడా ధరలు తక్కువగా ఉండడమే కాకుండా సినిమాలు హిట్ టాక్ కూడా రావడంతో క్యూ కడుతున్నారు.
మొత్తానికి నిర్మాతలు లోపం ఎక్కడ ఉందో అర్ధం చేసుకున్నారు.