బాలీవుడ్ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బుల్లితెరపై నాగిని సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొద్దిరోజుల నుంచి మౌని రాయ్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి.
త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు హల్ చల్ చేశాయి.
ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వీరి వివాహం గోవాలో ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిన్ననే ప్రారంభం కాగా నేడు ఈమె సూరజ్ నంబియార్ను వివాహం చేసుకున్నారు.
పెళ్లికి మౌని రాయ్ తెలుపు రంగు చీర కట్టుకోగా సూరజ్ లేత గోధుమ రంగు కుర్తా ధరించి చూడచక్కగా ఉన్నారు.అతి కొంత మంది సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మౌని రాయ్ సూరజ్ మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతులలో జరుపుకున్నారు.ఇక వీరి వివాహానికి మందిరా బేడీ, ఆష్కా గోరాడియా, అర్జున్ బిజ్లానీ వంటి ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది.అయితే కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇలా నేడు పెళ్లి బంధం ద్వారా ఒకటయ్యారు.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మౌని రాయ్ నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమేనని ఈమెకు తెలుగు అభిమానులు కూడా ఉన్నారని చెప్పవచ్చు.