బాబు పై మరోసారి విరుచుకుపడ్డ మోత్కుపల్లి

గత కొంత కాలంగా ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్న మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి మరోసారి తనదైన శైలి లో విరుచుకుపడ్డారు.నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకున్న సంగతి తెలిసిందే.

 Motkupalli Once Again Criticized Chandra Babu-TeluguStop.com

ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మాట్లాడుతూ… బాబు ఒక దొంగ,ప్రజా ద్రోహి అతడి నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టింది అంటూ వ్యాఖ్యానించారు.ఎవరినైనా వాడుకొని వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని నాకు గవర్నర్,రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.

అలానే రాజ్యసభ సీట్లు ఒక్కక్కటి వంద కోట్లకు అమ్ముకున్నారు అంటూ మోత్కుపల్లి ఆరోపించారు.అలానే ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా మోత్కుపల్లి విమర్శలు చేశారు.

తెలంగాణా లో టీడీపీ ని బతికిస్తాను అని చెప్పడం తో నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ లో బాబు ను ప్రజలు తరిమి కొట్టారు.

ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా తరిమి కొట్టారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం జెండా నీది కాదు.నందమూరి వాళ్ల జెండాయేనని.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ కి ఆపార్టీ అధినేత జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.చంద్ర ద్రబాబు ఇక సెలవు తీసుకో.

నువ్వు పెద్ద కొడుకువి కాదు.పెద్ద తాతవు.

పెద్ద కొడుకు అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube