తెలంగాణ టీడీపీలో కీలక నాయకుడైన మోత్కుపల్లి నరసింహులు రాజ్యసభ సీటుపై ఇంకా ఆశలు పెట్టుకొని ఉన్నారు.ఆయన ఆశలు తెలంగాణా మీద కాదు.
ఆంధ్రా మీద.అక్కడ ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి జగన్ పార్టీకి పోతే మిగిలిన మూడింటిలో ఒక్కటి తెలంగాణాకు ఇవ్వాలని టీడీపీ నాయకులు వేడుకుంటున్నారు.ఆ సీటు తనకు ఇవ్వాలని మోత్కుపల్లి సీఎం చంద్రబాబును చాలా కాలంగా అడుగుతున్నారు.
గతంలో ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని బాబు హామీ ఇచ్చారు.కానీ కేంద్రం ఆ విషయంలో సానుకూలంగా స్పందించలేదు.ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు బెడిసి కొడుతున్నాయి కాబట్టి గవర్నర్ పదవి వచ్చే అవకాశమే లేదు.
కాబట్టి రాజ్యసభ టికెట్టు ఇవ్వాలని మోత్కుపల్లి వేడుకుంటున్నారు.కానీ ఆంద్రాలో పరిస్థితి చూస్తుంటే మోత్కుపల్లి నెరవేరుతుందా అనే సందేహం కలుగుతోంది.
టీడీపీలో సీఎం కెసీఆర్ మీద విరుచుకుపడే నేతల్లో మోత్కుపల్లి ముందు వరుసలో ఉండేవారు.కానీ చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు.
ఒక దశలో పార్టీ నుంచి వెళ్లి పోతారనే ప్రచారమూ జరిగింది.రాజ్యసభ సీటు ఇవ్వకపోతే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో.