వారం రోజుల క్రితం బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన పఠాన్ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వసుళ్ళ సునామీ సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా కేవలం గడిచిన ఆరు రోజుల్లోనే ఏకంగా 600 కోట్లు వసూళ్లు రాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని చలనచిత్ర పరిశ్రమల సినిమాల రికార్డ్స్ అన్ని తుడుచుకుపెట్టిపోయాయి.
బాలీవుడ్ కలెక్షన్ల కింగ్ షారుఖ్ ఖాన్ ప్రధానోపాత్ర పోషించగా దీపికా పదుకొనే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించారు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదలైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ప్రస్తుతం కొన్ని మిలియన్ల కొద్ది వ్యూస్ పొందుతూ వైరల్ గా మారాయి.ఈ పాటలకు సోషల్ మీడియాలో అనేకమంది వారి స్టైల్ లో వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు.పఠాన్ సినిమాలోని ఝూమే జో పాటకు ఓ తల్లి కొడుకులు చేసిన అదిరిపోయే డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన బాలనటుడు రికీ పటేల్ అతని తల్లి కలిసి వారి స్టైల్ లో స్టేప్పులు వేశారు.ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఏకంగా లక్షల కొద్ది వ్యూస్ రావడం మాత్రమే కాకుండా.వేల సంఖ్యలో లైక్స్ కూడా వస్తున్నాయి.ముఖ్యంగా తల్లి కొడుకుల కాంబినేషన్ కాబట్టి ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం నటిజెన్లను ఆకట్టుకుంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.