ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తారలలో నటి సమీరా రెడ్డి ఒకరు.తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా, ఎన్టీఆర్ అశోక్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు స్వస్తి పలికి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరారెడ్డి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు.
ఇలా తెలుగు, కన్నడ, హిందీ భాషలలో నటించిన సమీరా రెడ్డి 2013వ సంవత్సరం వరద నాయక అనే కన్నడ సినిమాలో నటించిన తర్వాత 2014లో మహారాష్ట్ర కు చెందిన ఒక వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేని పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.పెళ్లి అనంతరం తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న సమీరా రెడ్డి ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
ఇలా సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి గోవాలో చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సమీరా రెడ్డి తన గోవా ట్రిప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.తన భర్తతో కలిసి గోవా బీచ్ లో బికినీ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేసిన ఈ భామ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా తన భర్త తన పిల్లలతో కలిసి బికినీలో ఉన్నటువంటి ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.పెళ్లయిన ఏ మాత్రం తగ్గేదేలే అంటూ తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను సందడి చేస్తున్నారు.
ఇలా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులనుపెంచుకున్న ఈ బ్యూటీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు అంటూ నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.