వ్యసనం మనిషిలో మృగాన్ని తట్టి లేపుతుంది.మానవత్వం నాశనం చేస్తుంది.
తన మన అనే బేధాలు లేకుండా విచక్షణ మరిచి ప్రవర్తించేలా చేస్తుంది.ఇక ఈ వ్యసనానికి బానిసలు అయిన చాలా మంది తాము మనుషులమనే విషయాన్ని మరిచిపోయి మృగాలుగా మారి కామవాంచలు తీర్చుకోవడానికి తల్లి, చెల్లి, కూతురు అని చూడకుండా ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఒక్కోసారి వారే ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరి కొన్ని సందర్భాలలో వారి కామ వాంచల కారణంగా ఆడవాళ్ళు బలైపోతున్నారు.చివరికి ఈ వ్యసనం మగాళ్ళలో మస్తిష్కం మలినం చేసి తల్లిని కూడా అదే దృష్టితో చూసేలా చేస్తుంది.
ఇక మృగంగా మారిన అలాంటి కొడుకుని ఏ తల్లి కూడా క్షమించలేదు.అందుకే తనపైనే అత్యాచారం చేయబోయిన కొడుకుని కనికరం లేకుండా చంపేసింది.
సమాజానికి ఒక సందేశం పంపించింది. బాపట్ల మండలానికి చెందిన యువకుడుకి ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది.
ఇద్దరు బిడ్డలు పుట్టారు.మద్యానికి బానిసైన ఆ యువకుడు రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు.
ఆ వేధింపులు భరించలేక ఆమె పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.వ్యసనాలకి బానిసైన కొడుకు తనకి భారం కాదని ఆ తల్లి ఆ యువకుడి పోషణ చూసుకుంటుంది.
అయితే వాడు మాత్రం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం తల్లిని వేధించేవాడు.ఈ క్రమంలోనే ఇటీవల మద్యం మత్తులో తల్లిని తీవ్రంగా కొట్టడంతో బంధువుల ఇంటికి వెళ్లింది.
అయితే తన కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని తిరిగి ఇంటికి వచ్చింది.ఈ క్రమంలో తాజాగా ఇంట్లో నిద్రిస్తున్నఆమెపైనే కొడుకు మద్యం మత్తులో అత్యాచారం చేయబోయాడు.
వెంటనే తేరుకున్న ఆమె కొడుకును ఆపే ప్రయత్నం చేసింది.అయినా కొడుకు అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
దీంతో ఆ తల్లి కొడుకు కళ్లలో కారం కొట్టింది.పక్కనే ఉన్న తాడు తీసుకుని అతడి మెడకు బిగించి చంపేసింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు ఆమెని అరెస్ట్ చేసిన కూడా ఆమె చేసిన దాంట్లో తప్పులేదని, ఆమెని విడుదల చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.