కొన్ని చెడువ్యసనాలు అలవాటైతే జీవితం సర్వనాశనం అవుతుంది.ఎంతటి వారైనా ఒక్కసారి వ్యసనాల జోలికి వెళ్తే ఇంక అంతే సంగతులు.
పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా చాలామంది వ్యసనాల బారిన పడి బంగారు కెరీర్ కూడా నాశనం చేసుకున్నారు.డ్రగ్స్ వాడడం వల్ల యువత దారి తప్పుతుంది.
ఈ మద్యే ఒక కొడుకు 50 రూపాయలు ఇవ్వలేదని తల్లినే హత్య చేసాడు.ఇలాంటి ఘటనలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి.
చిన్నవయసులోనే కొడుకు డ్రగ్స్ కు బానిసయ్యి ఆ తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు.ఇంక ఆ భాధలు భరించలేక కన్న కొడుకునే హత్య చేసింది.ఈ సంఘటన గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారంలో చోటుచేసుకుంది.
సుమలత అనే మహిళ నగరంలో పరిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తుంది.
పది సంవత్సరాల క్రితం ఆమె భర్త మృతి చెందడంతో సుమలత తన కొడుకు సిద్దార్థ్ తో కలిసి ఉంటుంది.సిద్దార్థ్ వ్యసనాలకు బానిసయ్యి తరచూ తల్లిని వేధించేవాడు.
తండ్రి చిన్న వయసులోనే మరణించడం, తల్లి ఉద్యోగస్తురాలిగా పనిచేయడం వల్ల సిద్దార్థ దారి తప్పి వ్యసనాలకు బానిసయ్యాడు.గంజాయి, తాగుడుకు బానిసయ్యి డబ్బులు ఇవ్వడం లేదని తరచు తల్లితో గొడవ పడేవాడు.
వ్యసనాలకు డబ్బులులేక దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.జైలు నుండి వచ్చిన తర్వాత కూడా తల్లిపై దాడిచేయడానికి పాల్పడడంతో సుమలత ఇంక భరించలేకపోయింది.ఒకరోజు తల్లితో గొడవపడి బయటకు వెళ్లిన సిద్దార్థ తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తుండగా సుమలత అతనిని కాళ్లు చేతులు కట్టేసి ముఖంపై దిండు పెట్టి హత్య చేసింది.
హత్య చేసిన తర్వాత తన పీడా విరగడైందని అరుచుకుంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది.చుట్టుపక్కల వారు చూడగా సిద్దార్థ్ చనిపోయి ఉన్నాడు.దీంతో పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సుమలత కోసం వెతుకుతున్నారు.ఆమెపై 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.