సోషల్ మీడియా. ఇది వచ్చిన తర్వాత మనుషుల మధ్య అంతరాలు పూర్తిగా తగ్గిపోయాయి.
మీరు ఈ దేశంలో ఉంటున్నారు.మేము ఆ దేశంలో ఉంటున్నాం కాబట్టి మన మధ్య సంభాషణలు జరిగే చాన్సే లేదు అనే పరిస్థితి నుంచి ఎవరు ఎక్కడ ఉన్నా కానీ చిటికెలో ఇక్కడ ఉన్న వారు చేసింది అక్కడ ఉన్న వారు చూసేస్తున్నారూ వినేస్తున్నారు.
ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ తో మన అరచేతిలోకి వచ్చేసింది.స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉంటున్న వారి టాలెంట్ కూడా బయటకు వస్తోంది.ఇంతకు ముందు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారి టాలెంట్ బయటకు వచ్చేది కాదు.
కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎక్కడ ఉంటున్నా వారికి టాలెంట్ ఉంటే అది నలుగురికీ ఇట్టే తెలిసిపోతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో మన ఇండియాకు చెందిన పశ్చిమ బంగా వాసి వేరుశనగలు అమ్ముకునే భుబన్ బద్నాకర్ అనే వ్యక్తి పాడిన పాటకు సౌత్ కొరియాకు చెందిన తల్లీ కూతుళ్లు చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.
వెస్ట్ బెంగాల్ లో వేరుశనక్కాయలు అమ్ముకునే భుబన్ బద్నాకర్ అనే వ్యక్తి పాడిన కచా బాదమ్ అనే సాంగ్ విపరీతంగా వైరల్ అయింది.ఈ పాటకు సౌత్ కొరియాకు చెందిన తల్లీ కూతుళ్లు చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా బాగుందంటూ లైక్ చేస్తూ షేర్లు చేస్తున్నారు.అంతే కాకుండా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఈ వీడియోకు ఇప్పటికే 17 వేలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
ఎలా ఉందో కామెంట్ చేయండి.