స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా హవా నానాటికీ పెరుగుతూనే ఉంది.ఇప్పటికే దీని మాయలో పడి ఎందరో విలువైన సమాయాన్ని వృథా చేసుకుంటూనే ఉన్నారు.
ఫేస్బుక్ వ్యామోహంలో పడితే ఇంక ఎవరు పిలిచినా పట్టించుకోనంత బిజీగా గడిపేస్తున్నారు.చివరకు తాము ఏం పని చేస్తున్నామో కూడా పట్టించుకోకుండా ఇబ్బందుల్లో పడుతున్నారు.
ఇక ఇప్పుడు ఓ తల్లి ఫేస్ బుక్ పిచ్చి వల్ల ఆమె ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.ఇంకా విశేషం ఏంటంటే వారు చనిపోయిన విషయం బయటివారు చెప్పే దాకా ఆమెకు తెలియకపోవడం గమనార్హం.
దీంతో తన ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారిన తెలుసుకుని బోరున ఏడ్చేసింది.కానీ ఆమె ఎంత ఏడ్చినా ఏం లాభం అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది.తన ఫస్త్రస్ బుక చేసిన తప్పెంటో తెలుసుకొని కన్నీరు కార్చింది.కానీ ఏం లాభం.
అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది.కాగా రొమేనియా నగరంలోని ప్లోయిస్టి ఏరియాలో నివాసం ఉంటున్న ఆండ్రియాకు నిత్యం సోషల్ మీడియాలో ఉండటం అంటేనే ఇష్టం.
కాగా ఆమెకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.ఒకరోజు కూడా ఇలాగే ఫేస్ బుక్ బిజీలో ఉంది.
అయితే తన ఇద్దరు పిల్లలు కూడా ఆడుకుంటూ 10 వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయారు.అయినా కూడా ఆండ్రియా మాత్రం లైవ్ స్ట్రీమింగ్లో బిజీగా గడుపుతోంది.పిల్లలు అప్పటికే కిందపడి ప్రాణాలు కోల్పోయారు.కానీ ఈ విషయాన్ని ఆమె గ్రహించలేదు.కాగా పిల్లలు కిందపడ్డ విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు కూడా అక్కడకు వచ్చి చేరుకున్నారు.ఇక ఇలా పోలీసులు వచ్చి ఆమెకు చెప్పే వరకు ఫేస్బుక్లోనే మునిగిపోయింది.
కాగా ఆమె పెద్ద కుమారుడితో వేరే రూమ్లో పనిచేసుకుంటున్నానని తనకు ఏం తెలియదని బుకాయించింది.కానీ ఆమె పిల్లలు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.