విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ పై ఐదవ అంతస్తు నుండి దూకి తల్లి కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే తల్లీకూతుళ్లు మృతిచెందారు.
మృతులు మాధవి, బొప్పన సత్యవతిగా గుర్తించారు.సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.