చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ అగ్ర రాజ్యాన్ని సైతం గడగడలాడిస్తోంది.రోజు రోజు దారుణంగా వ్యాపిస్తుంది.
దీంతో రెండు నెలల క్రితం ప్రపంచ దేశాలు రెండు నెలలకుపైగా పైగా లాక్ డౌన్ అమలు చేశాయి.దీంతో ఉరుకుల పరుగుల జీవితానికి ఈ లాక్ డౌన్ కొంత బ్రేక్ ఇచ్చింది.
ఎక్కడో ఎప్పుడో ఫోన్ లో మాటలు వీడియో కాల్స్ లో చూపులు ఉన్న ఆ రోజులకు బ్రేక్ పడి కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం వచ్చింది.సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు ప్రతి ఒక్కరు ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
సరే ఇది అంత బాగుంది.మరి బిర్యానీ ప్రియుల సంగతి ఏంటి?
హైదరాబాద్ బిర్యానీ, బావార్చి బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలా ఎన్నో పేర్లతో బిర్యానీలు తినే బిర్యానీ ప్రేమికులకు ఈ లాక్ డౌన్, కరోనా పెద్ద ఎఫెక్ట్ అయ్యింది.ఇంటి భోజనం ఎంత తిన్న బిర్యానీ ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు.దీంతో కొందరు యూట్యూబ్ చూసి బిర్యాని నేర్చుకొని ఇంట్లోనే చేసుకొని తింటే మరికొందరు మాత్రం లాక్ డౌన్ లో సైతం ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నారు.
దేశవ్యాప్తంగా ఆన్లైన్లో అధిక శాతం ఆర్డర్ ఇచ్చిన వాటిలో బిర్యానీ అగ్ర స్థానంలో ఉందని స్విగ్గి తన నివేదికలో పేర్కొంది.భోజన ప్రియులు ‘బిర్యానీ’పై ఎంతో ఆసక్తి చూపారని తెలిపారు.లాక్ డౌన్ సమయంలో బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి నివేదిక తెలిపింది.దీని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది.బిర్యానీ ప్రియులు ఎంతమంది ఉన్నారు అనేది.