అమెరికాలో ఉంటున్న వివిధ దేశాల ఎన్నారైలలో అత్యధికంగా ఇండియాకి చెందిన ఎన్నారైలు ఎక్కువగా న్నారని, గతంలో పోల్చి చూస్తే భారీగా భారతీయుల సంఖ్య పెరిగిందని ఓ నివేదిక తెలిపింది.భారతీయుల తరువాత ప్లేస్ ని నేపాల్ ఆక్రమించింది.
ఇంతకీ ఏమిటా లెక్కలు, ఎందుకు ఆ నివేదిక అనే వివరాలలోకి వెళ్తే.భారతీయులు అక్కడ కూడా అత్యధికంగా ఉన్నామా అని నోళ్ళు వెళ్ళబెడుతారు.
సౌత్ ఏషియా అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) అనే సంస్థ అమెరికాలో ఉంటున్న విదేశీయులలో
2010-17 మధ్య కాలంలో ఏ దేశం వారు అత్యధిక జనాభాగా నమోదు అయ్యారు అనే సర్వే చేపట్టారు.ఈ సర్వేలో, 38 శాతం భారతీయులు పెరిగినట్లుగా సదరు సంస్థ నివేదిక వెల్లడించింది.2010లో భాతీయుల జనాభా 31,83,063 ఉండగా 2017 అప్పటికి అది 44,02,363 కి పెరిగినట్లు తెలిపింది.
ఇదిలాఉంటే 6,50,000 మంది అమెరికాలో అక్రమంగా ఉన్నట్లుగా కూడా ఆ నివేదిక వెల్లడించింది.2010 తో పోలిస్తే ఈ సంఖ్య 76 శాతం పెరిగిందని వివరించింది.అమెరికాలో దక్షిణాసియా మూలలున్న వారి జనాభాలో 40 శాతం పెరిగినట్లు సదరు సంస్థ అంచనా వేసింది.
ఇదిలాఉంటే అందరిలో అత్యధికంగా నేపాలీలు ఉండగా, ఆ తరువాత స్థానంలో భారత్ ఉందని, తరువాతి స్థానాలలో, భూటానీలు, పాకిస్థానీలు బంగ్లాదేశీయులు, ఉన్నారని సంస్థ తెలిపింది.