బంగారానికి మన దేశంలో ఎంత క్రేజ్ ఉంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మన దేశంలో ఏ ఒక్క మహిళను చూసినా సరే బంగారాన్ని వేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే మన దేశంలో బంగారానికి ఉన్నంత విలువ మరే లోహానికి కూడా లేదనేది కాదనలేని నిజం.మరి అంత స్థాయిలో మన దేశ ప్రజలకు పసిడిపై ఉన్న మోజుతో బంగారానికి ఇప్పుడు రెక్కలు వస్తున్నాయి.
అసలు బంగారానికి ఇప్పట్లో పోటీ అనేది లేకుండా పోయింది.అయితే ఇప్పటి వరకు ప్రజలు దీన్ని గోల్డ్ ఆర్నమెంట్ గా చూశారు.
కానీ ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే దీన్ని ఆధారంగా చేసుకుని బయట పడేందుకు కూడా కమోడిటిగానూ మంచి డిమాండ్ ఏర్పడింది.మరి ఇంత డిమాండ్ ఉన్న బంగారం మనం తినే ఫుడ్లో ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించండి.
వేసుకోవడానికే తులం లేదు గానీ ఇంకా తిండిలో అంటారా.అయితే సామాన్యులకు ఇది సాధ్యం కాకపోవచ్చు గానీ ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రం ఇది సాధ్యమే.
అవును మీరు వింటున్నది నిజమే నండి.ఇప్పుడు కూడా సేమ్ బంగారంతో ఆహారం కూడా వండేస్తున్నారు చాలా మంది చెఫ్లు.
చాలామందికి బిర్యానీ పేరు చెబితేనే నోట్లో లాలాజలం ఊరాల్సిందే.మరి దీనికి బంగారాన్ని ఆడ్ చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించండి.అవునండి ఇప్పుడు ఇలాంటి బిర్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది.అయితే ఇది మన దగ్గర కాదండోయ్.
దుబాయ్లో ఇప్పుడు ఇలాంటి బిర్యానికి మంచి డిమాండ్ ఉంది.చాలామంది అక్కడి దేశస్థులు ఇలాంటి బిర్యానీనే తినేందుకు ఇష్టపడుతున్నారంట.
దీంతో దీన్ని క్యాచ్ చేసుకునేందుకు రెస్టారెంట్లు కూడా పోటీ పడి మరీ ఇలాంటి బిర్యానీని తయారు చేస్తున్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బిర్యానీ గురించి చూసేయండి.