అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. ఈ సినిమాలో అఖిల్ కు జంటగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది.
దసరా కానుకగా విడుదల అయినా బ్యాచిలర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.అఖిల్ ఆరు సంవత్సరాల కెరీర్ లో మంచి సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
ఆయన కోరికను ఈ సినిమా నెరవేర్చింది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అసలైన విజయం ఎలా ఉంటుందో రుచి చూసాడు.
ఈ సినిమా విడుదల అయినా ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ అద్భుతంగా వసూలు చేసి డిస్టిబ్యూటర్స్ కు లాభాలను తెచ్చిపెట్టింది.బాక్సాఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా అక్కినేని వారసుడి మొదటి కమర్షియల్ హిట్ అనిపించుకుంది.
థియేటర్స్ లో ఘానా విజయం సాధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఆహా ఓటిటి లోను స్ట్రీమింగ్ అయ్యి అక్కడ కూడా మంచి వ్యూస్ రాబట్టింది.
ఈ క్రమంలో ఇటీవల స్టార్ మా ఛానెల్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సినిమాను ప్రసారం చేసింది.థియేటర్, ఓటిటి లోనే కాదు ఇప్పుడు టెలివిజన్ పైన కూడా ఈ సినిమాకు మంచి టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు 9.31 టీఆర్పీ రేటింగ్ సాధించి ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక అఖిల్ ఈ సినిమా తర్వాత చేస్తున్న ఏజెంట్ సినిమాచేస్తునందు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.ఈసారి అఖిల్ మాస్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు.
మొత్తానికి అఖిల్ ఎదురు చుసిన హిట్ అయితే తన ఖాతాలో వేసుకుని మరొక హిట్ కొట్టాలని చూస్తున్నాడు.