అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అఖిల్ బుట్టబొమ్మ పూజా హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నాడు.ఈ సినిమా గత సంవత్సరం నుండి విడుదలకు నోచుకోవడం లేదు.
కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
కరోనా తర్వాత కూడా థియేటర్స్ ప్రాబ్లెమ్ వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.
ఇక ఈ మధ్యనే అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.అఖిల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క మంచి హిట్ కూడా కొట్టలేదు.
ఇక ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ గట్టిగానే శ్రమించాడు.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా బాగా ఆకట్టు కున్నాయి.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 10 నిముషాలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.ఈ పోస్టర్ కు ఆకట్టుకునే విధంగా ఉంది.అఖిల్, పూజా తో పాటు ప్రధాన తారాగణం కూడా ఈ పోస్టర్ లో కనిపించారు.ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.మరి చూడాలి ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.