టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ కొడతాడా అనే సందేహం అందరిలో నెలకొంది.
గతంలో బొమ్మరిల్లు వంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ కావడంతో ఈసారి పక్కా సూపర్ హిట్ కొడతాడని అందరూ అనుకుంటున్నారు.దీనికి తగ్గట్లుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో గతకొంత కాలంగా అయోమయం నెలకొంది.
కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అక్టోబర్ 12 లేదా 13న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోన్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.దసరా రేసులో ఇప్పటికే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ప్రయత్నిస్తున్నారు.
దీంతో అఖిల్ దసరా రేసులో ధైర్యం చేసి దిగుతాడా లేక మరోసారి వెనకడుగు వేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
మరి దసరా రేసులో ఇప్పటికే రిలీజ్ అవుతుందని భావిస్తున్న అఖండ చిత్రంతో అఖిల్ బ్యాచ్లర్ మూవీ ఎలాంటి పోటీని ఎదుర్కొంటుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు.ఇక బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా తెలియాల్సి ఉండటంతో ప్రేక్షకులు దీని కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.