అక్కినేని హీరో అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.
ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లుఅర్జున్ పాల్గొని అక్కినేని కుటుంబం పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒకే సీజన్లో అక్కినేని హీరోలు అఖిల్, చైతన్య సినిమాలు విజయవంతం కావడం బ్యూటిఫుల్ మెమొరీ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం సాధించినందుకు అఖిల్ కి అల్లుఅర్జున్ కంగ్రాట్స్ చెప్పారు.అదే విధంగా నాగచైతన్య సుకుమార్ దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా విజయవంతం కావడంతో లవ్ స్టోరీ చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్ ప్రత్యేకంగా నాగచైతన్యకు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఇలా అఖిల్ చైతన్య సినిమాలు ఒకేసారి హిట్ కావడంతో నాగార్జున గారు ఎంతో సంతోషంలో ఉన్నారో తనకి అర్థమవుతోందని నిజంగానే ఇది అక్కినేని ఫ్యామిలీకి బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటూ అల్లు అర్జున్ మాట్లాడారు.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.ఈమె నాకు మాత్రమే స్పెషల్ అనుకున్నా కానీ పూజ అందరికీ స్పెషల్ అంటూ తన ఘటనపై ప్రశంసలు కురిపించారు.