అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ను చిత్ర యూనిట్ భారీ రేటుకు అమ్మేసినట్లు తెలుస్తోంది.ప్రముఖ ‘స్టార్ మా’ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ను ఏకంగా రూ.6.5 కోట్లకు సొంతం చేసుకుంది.అఖిల్ చిత్రాల్లో ఇంతటి భారీ రేటుకు శాటిలైట్స్ రైట్స్ అమ్ముడు కావడంతో, ఈ చిత్రం ఆయన కెరీర్లోనే రికార్డుగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.సరికొత్త లవ్స్టోరి చిత్రంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోన్నారు.
ఈ సినిమాతో అఖిల్ అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా ఆయన కెరీర్కు మరింత బూస్ట్ ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ సినిమాను బన్నీ వాస్ GA2 బ్యానర్పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి సక్సెస్ కొడతాడో చూడాలి.
ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్ పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.