అఖిల్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన అఖిల్ కు తొలి సినిమాతోనే చేదు అనుభవం ఎదురైంది.ఆ సినిమా తరువాత అఖిల్ హలో, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించగా ఆ సినిమాలు సైతం కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచాయి.
ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా టీజర్ దసరా పండుగ కానుకగా నేడు విడుదలైంది.అఖిల్ ఈ సినిమాలో పెళ్లి కోసం పరితపించే కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడు.ఎన్ని పెళ్లిచూపులకు వెళ్లినా ఏదో ఒక కారణం వల్ల ఆ పెళ్లిచూపులు ఆగిపోతూ ఉంటాయి.
పూజా హెగ్డే తనకు కాబోయే వాడు షూస్ తో సమానమని భావించే అమ్మాయి పాత్రలో నటిస్తోంది.పూజా అఖిల్ ను “సన్ రైజ్ ఇష్టమా.? సన్ సెట్ ఇష్టమా.?” అని అడగగా తనకు సన్ సెట్ ఇష్టమని సన్ సెట్ తరువాతే రాత్రి వస్తుందని ఫన్నీగా చెబుతాడు.టీజర్ లో ఒక సన్నివేశంలో పూజా హెగ్డే అఖిల్ ను సైకో ఫెల్లో అంటూ కామెంట్ చేస్తూ ఉంటుంది.వరుస ఫెయిల్యూర్ లతో ఢీలా పడిన అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో చేరేలా ఉంది.
బుట్టబొమ్మ పూజాహెగ్డే అఖిల్ జోడీ బాగుంది.నటనలో అఖిల్ తన గత సినిమాలతో పోల్చి చూస్తే ఎంతో బెటర్ గా నటించినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది.మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్టైతే మాత్రమే బొమ్మరిల్లు భాస్కర్ కు డైరెక్టర్ గా అవకాశాలు వస్తాయి.
ఎంతోమంది జీవితాలు ఆధారపడిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.