అక్కినేని అఖిల్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
మొన్న జూన్ లో కూడా విడుదల చేయాలనీ అనుకున్నారు.కానీ మళ్ళీ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమా విడుదల అనుకున్నప్పుడల్లా కరోనా అడ్డంకిగా మారుతుంది.ఇక ఎట్టకేలకు అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.రిలీజ్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ దక్కించు కున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ వచ్చేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరొక పోస్టర్ ను విడుదల చేసారు. సింగర్ చిన్మయి ఈ సినిమాలో నటిస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది బ్యాచిలర్ చిత్ర యూనిట్.
ఈ రోజు బ్యాచిలర్ టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.ఈ రోజు చిన్మయి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఈమె కూడా భాగం అయ్యిందని తెలిపారు.
ఈ సినిమా ద్వారా సింగర్ చిన్మయి వెండితెరకు పరిచయం అవుతున్నారు.అయితే ఈమె ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తుందో అనే విషయం ఇంకా క్లారిటీ లేదు.ఇక ఇప్పటి వరకు చిన్మయి పాటలు విన్న టాలీవుడ్ ప్రేక్షకులు ఇక తన నటన ఎలా ఉంటుందో చూడబోతున్నారు.సింగర్ గా ఎన్నో అద్భుత మైన పాటలు పడిన చిన్మయి నటన పరంగా ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.