బ్యాచ్‌లర్ హిట్ కోసం రంగంలోకి దిగిన మన్మధుడు...

ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో అఖిల్ సరసన టాలీవుడ్ గ్లామర్ డాల్ పూజా హెగ్డే నటిస్తోంది.

 Most Eligible Bachelor Movie Latest Making News-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.తాజాగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించినటువంటి అవుట్ ఫుట్ ని అక్కినేని అఖిల్ తండ్రి  అక్కినేని నాగార్జున పరిశీలించగా ఈ అవుట్ ఫుట్ పై నాగార్జున అంతగా సంతృప్తిగా లేనట్లు సమాచారం.

దీంతో దర్శకుడు భాస్కర్ ని పిలిచి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేర్పుల గురించి వివరించినట్లు తెలుస్తోంది.అంతేకాక అఖిల్ గతంలో నటించినటువంటి అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో నాగార్జున ఈసారి ఈ బ్యాచ్‌లర్ తో ఎలాగైనా హిట్ కొట్టించాలని చాలా జాగ్రత్తగా సన్నాహాలు చేస్తున్నాడు.

Telugu Akhileligible, Nagarjuna-Movie

దీంతో దర్శకుడు భాస్కర్ కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఈ చిత్రం దాదాపుగా 40 శాతం చిత్రీకరణ పూర్తయింది.అయితే ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరో వార్త కూడా నెట్లో హల్ చల్ చేస్తుంది.

తాజాగా దర్శకుడు భాస్కర్ చిత్రంలోని కొన్ని ఎలివెట్ సన్నివేశాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటింపజేయాలని చేయాలని అనుకుంటున్నట్లు పలువురు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే ఈ విషయంపై దర్శకుడు భాస్కర్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube