హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వరుసగా మూడు ఫ్లాప్ లతో ఉన్న అక్కినేని యువ హీరో అఖిల్.మొదటి సినిమా ఏదో కొత్తగా ప్రయత్నం చేద్దామని సూపర్ హీరో రేంజ్ లో చేస్తే అది డిజాస్టర్ అయ్యింది.
రెండో సినిమాలో కూడా లవ్ స్టోరీ కంటే అనవసరమైన యాక్షన్ ఎపిసోడ్ వలన దొబ్బింది.ఇక మూడో సినిమా రొటీన్ లవ్ స్టోరీకి దర్శకుడు ఫారిన్ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసిన ప్రేక్షకులు తిప్పి కొట్టారు.
అయితే ఇప్పుడు అలాంటి ప్రయోగాలు ఏమీ లేకుండా సింపుల్ గా లవ్ బాయ్ గా రావడానికి ట్రై చేస్తున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో అఖిల్ జోడీగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ఇక గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటం వలన సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ బుధవారం విడుదలయింది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది.
టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది.ఇక సాంగ్స్ చిత్రీకరణ మిగిలి ఉంది.
కరోనా సమస్య పరిష్కారం అయితే వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
ఇక ఈ సినిమా అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి, ఇటు హీరో అఖిల్ కి చాలా కీలకం.కచ్చితంగా వీరిద్దరూ ముందుకి వెళ్లాలంటే ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిందే.