తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే కాగా ఈ చిత్రంలో హీరోగా అక్కినేని హీరో అక్కినేని అఖిల్ నటిస్తుండగా హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటిఫుల్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.అలాగే నటి ప్రగతి, శ్రీకాంత్ అయ్యంగార్, సుమిత్, సీనియర్ హీరోయిన్ ఆమని, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్, ఈశా రెబ్బ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఇటీవలే హీరో అక్కినేని అఖిల్ మరియు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహించిన ఇంటర్వ్యూ పాల్గొన్నారు ఇందులో భాగంగా ఈ చిత్రంలోని నటీనటుల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఇందులో పలు చిత్రాలలో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ గురించి స్పందిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ ఎనర్జీ ముందు తట్టుకోవడం చాలా కష్టమని అంతేకాకుండా ఇలాంటి డైలాగులు ఇచ్చినా సరే ఇట్టే చెబుతూ అందర్నీ ఆశ్చర్య పరుస్తాడని తెలిపాడు.
ఆ తర్వాత హీరో అక్కినేని అఖిల్ ఈ చిత్రంలో తన సోదరుడి పాత్రలో నటించిన అమిత్ తివారి గురించి స్పందిస్తూ అమిత్ తివారి ని తాను చిన్నప్పటి నుంచి విలన్ పాత్రలలో చూసి తన రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాడేమో అనుకొని కానీ అమిత్ తివారి సినిమా సెట్లో చాలా సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా అమిత్ తివారి గురించి స్పందిస్తూ చాలా స్నేహంగా ఉంటాడని అలాగే మంచి సోదరుడు అంటూ కితాబు ఇచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ చిత్రాన్ని ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.మరి అక్కినేని అఖిల్ కనీసం ఈసారైనా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రంతో హిట్ కొడతాడో లేదో అని అక్కినేని అఖిల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి అఖిల్ తన అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.