సూపర్ స్టార్ మహేష్బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్లు ఇంకా పలువురు టాలీవుడ్ స్టార్స్ ఉన్నా కూడా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్గా మాత్రం విజయ్ దేవరకొండ నిలిచాడు.2018 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ మెన్గా నిలిచిన విజయ్ దేరకొండ మరోసారి అంటే 2019 సంవత్సరానికి కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్గా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.వరుసగా ఈయన రెండు సార్లు మోస్డ్ డిజైరబుల్ మెన్గా నిలవడం చర్చనీయాంశం అయ్యింది.
రెండవ స్థానంలో ప్రభాస్ ఉన్నాడు.
ఎన్టీఆర్, మహేష్బాబులకు టాప్ జాబితాలో అసలు చోటు లేకుండా పోయింది.ఆశ్చర్యకరంగా మోస్ట్ డిజైరబుల్ టాప్ జాబితాలో యాంకర్ ప్రధీప్ మరియు సుధీర్బాబులు నిలవడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తూ ఉన్నా కూడా గీత గోవిందం ఇంకా అర్జున్ రెడ్డిల నుండి ఆయన బయట పడ్డట్లుగా లేడు అంటున్నారు.
ఆయన అభిమానులు ఇంకా ఆయనలో అర్జున్ రెడ్డి ఇంకా గీత గోవిందం హీరోనే చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండ గత ఏడాది రెండు ఫ్లాప్స్ చవిచూసినా కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్గా నిలవడం ఆనందం కలిగించే విషయం.ప్రస్తుతం పూరితో చేస్తున్న మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాననే నమ్మకంతో విజయ్ ఉన్నాడు.
మరి ఆయన నమ్మకం నిలిచి మళ్లీ వచ్చే ఏడాదికి కూడా మోస్ట్ డిజైరబుల్గా నిలుస్తాడా చూడాలి.