మంచు విష్ణు హీరోగా ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హాలీవుడ్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జి చిన్ డైరెక్ట్ చేస్తుండగా ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా భారత్లో జరిగిన ఓ ఐటీ స్కాం ఆధారంగా తెరకెక్కనుందని, ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాతో పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కూడా ముంబై బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుండగా, ఈ సినిమాను కూడా ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్లోనూ తెరకెక్కిస్తున్నారు.
ఇలా ఎందుకు చేస్తున్నారని మంచి విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
తను సినిమా కథలు లేని సమయంలో హాలీవుడ్లో ఒక ప్రొడక్షన్ హౌజ్ను తెరిచాని, అందులో ఇద్దరు రైటర్స్ను పెట్టుకుని కథలు రాయించుకున్నాడని, ఆ కథను తొలుత ఇంగ్లీష్లోనే తెరకెక్కించాలని అనుకున్నాడట.
అయితే చిత్ర నిర్మాతలు ఈ సినిమాను తెలుగులోనూ తీయాలని చెప్పారట.ఆడియెన్స్ను మెప్పించే కంటెంట్ ఈ సినిమాలో ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట.
అందుకే ఈ సినిమాను కూడా ఇంగ్లీ్ష్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.