ఇళ్ళల్లో దొంగలు ఎక్కువగా చొరబడి దొంగతనాలకి పాల్పడుతూ ఉంటారు.విలువైన వస్తువులు దోచుకుపోతూ ఉంటారు.
ఇలాంటి ఘటనలు తరుచుగా జరిగేవే అయితే అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి.అలాంటి సంఘటనలలో ముందుకి వినిపించే పేరు కోతులు.
ఈ కోతులు చేసే వింత చేష్టలకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాటితో ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చిన్న మనుషులకి కోతులకి దగ్గర సంబంధం ఉండటం వలన అవి కొన్ని పనులు మనుషుల తరహాలోనే చేస్తాయి.ఇప్పుడు అలాగే ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనంకి చేసాయి.
కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి.
అయితే ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి.స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదు.
అయితే ఈ ఘటనపై పోలీసులకి ఎలా ఫిర్యాదు చేయాలో అర్ధం కాని పరిస్థితిలో బంగారం పోగోత్తుకున్న బాధితులు ఉన్నారు.