ఈ వారం మొదట్లో రెండు రోజులు అగ్రారాజ్యాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన చేసిన సంగతి తెలిసందే.ట్రంప్ భారత్ వస్తున్నాడు అని గోడలు కట్టేసి స్లమ్ ఏరియాస్ ని దాచేసి.
తాజ్ మహల్ ను కడిగేసి ఆ రెండు రోజులు తెగ హడావిడి చేసిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ నేపథ్యంలోనే ట్రంప్ దంపతులకు భారత ప్రభుత్వం ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన సంగతి విదితమే.
ఆ విందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఏడు రాష్ట్రాల సీఎంలు, భారత్-అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వచ్చారు.వీరితోపాటు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
అయితే ఈ విధుల్లో అంతమంది అక్కడ ఉంటే.ఆహ్వానం లేకుండా ట్రాంప్ విందుకు వచ్చిన ఒకరిపై రెహమాన్ దృష్టి సారించాడు.
ఎవరబ్బా అతను అని అనుకుంటున్నారా? ఇంకెవరు ఓ కోతి అక్కడి పూలకుండీలోని ఆకులను తింటుంది.అది ఆలా చేస్తుండగా సైలెంట్ గా వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో ”మా చిట్టిపొట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చేశాడు” అంటూ వీడియోను షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.