ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో నిన్న ప్రారంభమైంది.హోస్ట్ అక్కినేని నాగార్జున తొలి ఎపిసోడ్ తోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అందించబోతున్నాంటూ చెప్పిన నాగ్ ఈసారి షోలో 9 మంది లేడీ కంటెస్టెంట్లను ఎంపిక చేయడం గమనార్హం.దీంతో ఈసారి బిగ్ బాస్ షోలో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టే కంటెస్టెంట్ ఎవరు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
గత సీజన్ లో పునర్నవి, శ్రీముఖిలకు వాళ్ల గ్లామరే చివరి వరకు షోలో కొనసాగేలా చేయడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ఓట్లను తెచ్చిపెట్టింది.యాంకర్ శ్యామల, అషు రెడ్డి, తేజస్వి మదివాడ లాంటి వాళ్లకు సైతం తెలుగు బిగ్ బాస్ షోలలో వాళ్ల గ్లామర్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది.
అయితే ప్రస్తుతం మాత్రం గ్లామర్ క్వీన్ రేసులో దేత్తడి హారిక, సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్, అరియానా గ్లోరీ, దివి నిలిచారు.
యూట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్న దేత్తడి హారిక చిట్టిపొట్టి డ్రస్సులతో షోలో అందాలను ప్రదర్శిస్తోంది.రామ్ గోపాల్ వర్మ తొడలపై కామెంట్ చేయడంతో వార్తల్లో నిలిచిన అరియానా గ్లోరీ గ్లామర్ తో బిగ్ బాస్ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.అడపాదడపా పాత్రల్లో నటించిన దివి గ్లామరస్ గానే కనిపిస్తున్నా నెటిజన్లకు ఈమె గురించి పెద్దగా తెలియదు.
అయితే వీళ్లందరితో పోలిస్తే మోనాల్ గజ్జర్ కే గ్లామర్ క్వీన్ గా ఎక్కువ గుర్తింపు దక్కుతోంది.
మోనాల్ గ్లామర్ వల్లే బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆమెకు మొదటి కంటెస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చారు.
బాంగ్ బాంగ్ పాటలో గ్లామర్ తో మోనాల్ ప్రేక్షకుల హృదయాలను బాంగ్ చేసిందనే చెప్పాలి.ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మోనాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కావడం ఆమెకు ప్లస్ అవుతోంది.
బిగ్ బాస్ షో టైటిల్ రేసులో నిలిచే వాళ్లలో మోనాల్ ముందువరసలో ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.